తబ్లీగీలకు ఆశ్రయం.. హైదరాబాద్‌లో 11 మందిపై కేసు నమోదు

జమాత్ మర్కజ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన పేరు ఇది. ఇక్కడికి ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి కారణంగానే దేశంలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని కేంద్రం ప్రకటించింది. అక్కడికి వెళ్లొచ్చిన వారు ఎవరైనా స్వచ్ఛందంగా హాస్పిటళ్లకు రావాలని ఢిల్లీ వెళ్లొచ్చిన వారిని ప్రభుత్వాలు పదే పదే కోరుతున్నాయి. భయమో, లేదంటే నలుగురు చులకనగా చూస్తారనే భావన కారణమో తెలీదు కానీ కొందరు మాత్రం తాము ఢిల్లీ వెళ్లొచ్చామని చెప్పడం లేదు. దీంతో ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరించి వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే జమాత్‌కు వెళ్లొచ్చిన వారికి ఆశ్రయించిన కల్పించిన 11 మందిపై హైదరాబాద్‌లోని హబీబ్ నగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు.